అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆతిథ్యం కంటే పూరీలో జగన్నాథుడి దర్శనం తనకు ముఖ్యమని భారత ప్రధాని మోదీ అన్నారు. ట్రంప్ ఆహ్వానాన్ని ఇటీవల మోదీ మర్యాదగా తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆయన విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ట్రంప్ మోదీని వాషింగ్టన్కు ఆహ్వానించారు. అయితే, తాను రాలేనని ట్రంప్తో అన్నారు. తన విదేశీ పర్యటన ముగించుకుని శుక్రవారం ఆయన నేరుగా భారతదేశానికి వచ్చారు. బీహార్ పర్యటన తర్వాత ఒడిశాకు వచ్చారు. ఆయన ఒడిశాలో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడి ఆతిథ్యం కంటే పూరీలో జగన్నాథుడి దర్శనం తనకు ముఖ్యమని ఆయన అన్నారు.
ట్రంప్ ఎందుకు ఆహ్వానించారు?
ప్రధాని మోదీ G7 శిఖరాగ్ర సమావేశానికి కెనడాలో ఉన్నారు. ఆ పర్యటన కోసం ట్రంప్ కూడా వచ్చారు. కానీ ఆయన ఊహించని విధంగా మోడీతో మీటింగ్ కాకుండానే అమెరికా వెళ్లిపోయారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ట్రంప్ వెనక్కి వెళ్లిపోయారు. ట్రంప్ వాషింగ్టన్ వెళ్లిన తర్వాత మోదీని విందుకు ఆహ్వానించారు. అదే సమయంలో, ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను కూడా విందుకు ఆహ్వానించారు. భారత్-పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపామని గొప్పలు చెప్పుకున్న ట్రంప్, భారత ప్రధాని మోదీని, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ను ఒకే వేదికపై ఉంచాలనుకున్నారు. తాను మరింత తెలివైనవాడినని నిరూపించుకోవాలనుకున్నారు. కానీ మోడీ ట్రంప్ ఆశలను వమ్ము చేశారు. తాను రాలేనని అన్నారు. భారతదేశానికి వచ్చిన తర్వాత మోడీ తన పర్యటనలతో బిజీగా ఉన్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించారో ఆయన వెల్లడించారు.
ఒడిశాలో ఒకేరోజు 105 ప్రాజెక్టులు..
బిజెపి పాలిత రాష్ట్రాల్లో సామాజిక-ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని మోడీ అన్నారు. ఇటీవల ఒడిశాలో రూ.18,600 కోట్ల విలువైన 105 ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. సుపరిపాలన మరియు ప్రజా సేవ పరంగా ఒడిశా ప్రభుత్వం తన ఒక సంవత్సరం పాలనను విజయవంతంగా పూర్తి చేసిందని మోడీ అన్నారు. ఈ సందర్భంలో ట్రంప్ ఆహ్వానాన్ని ఆయన ప్రస్తావించారు. జి7 శిఖరాగ్ర సమావేశానికి కెనడాకు వెళుతున్నప్పుడు, ట్రంప్ తనకు ఫోన్ చేసి వాషింగ్టన్ ద్వారా వెళ్లి విందుకు హాజరు కావాలని అలాగే, కొన్ని అంశాలపై చర్చించాలని సూచించారని ఆయన అన్నారు. ఒడిశా పర్యటన ఇప్పటికే ఖరారైందని, జగన్నాథుని పవిత్ర భూమికి వెళ్లడం తనకు ముఖ్యమని, కాబట్టి ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించానని మోడీ అన్నారు. మోడీ అమెరికా వెళ్లి ఉంటే, ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొనేవాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో ఒకే వేదికపై ఉండటం భారతదేశానికి అవమానం. అందుకే ఆయన ఆ పర్యటనను తిరస్కరించారు.