ముగిసిన మూడో రోజు ఆట..
భారత్ రెండో
టెస్టులో శ్రీలంక ప్రతిఘటన
అజేయంగా 84 పరుగులు
చేసి ఒంటరి పోరాటం
చేస్తున్న సోనాల్ దినూశ
మూడో రోజు ఆట ముగిసేసరికి
శ్రీలంక స్కోరు 265/8
ప్రస్తుతం 238 పరుగుల
భారీ ఆధిక్యంలో టీమిండియా
వర్షం, వెలుతురులేమి కారణంగా ముందుగానే ముగిసిన ఆట
భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక గట్టిగా పోరాడుతున్నప్పటికీ, టీమిండియా పట్టు బిగించింది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. వర్షం, వెలుతురులేమి కారణంగా ఆటను ముందుగానే నిలిపివేశారు. ప్రస్తుతం భారత్ ఇంకా 238 పరుగుల భారీ ఆధిక్యంలో ఉండి మ్యాచ్పి పూర్తి నియంత్రణతో ఉంది. మూడో రోజు ఆటలో శ్రీలంక బ్యాటర్ సోనాల్ దిసూశ అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ 135 బంతుల్లో 84 వరుగులతో అజేయంగా నిలిచాడు.
భారత స్పిన్నర్లపై స్వీప్ షాట్లను సమర్థంగా అడుతూ ఒంటరి పోరాటం చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో అతను ఒక అరుదైన ఘనత సాధించాడు. భారత్పై తన తొలి మూడు టెస్ట్ ఇన్నింగ్స్లో వరుసగా మూడు 500 స్కోర్లు సాధించిన రెండో శ్రీలంక బ్యాటర్గా (దులీప్ మెండిస్ తర్వాత) రికార్డు సృష్టించాడు. అతనికి కేశర సువంత (18) నుంచి కొంత సహకారం లభించింది. అయితే, వీరి భాగస్వామ్యాన్ని భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ విడదీశాడు. సుతార్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన నువంత, మిడ్-ఆఫ్ సారాంశ్ జైను క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, మాసవ్ సుతార్ అద్భుతంగా రాణించి చెరో మూడు వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు. మూడో రోజు చివరి సెషన్లో రెండో కొత్త బంతి అందుబాటులోకి రావడంతో శ్రీలంక ఇన్నింగ్స్ను త్వరగా ముగించాలని భారత్ స్సులోనే వాకానీ, వెలుతురు తగ్గడంతో స్పిన్నర్లతోనే బౌలింగ్ కొనసాగించాల్సి వచ్చింది. సాయంత్రం 5 గంటల సమయంలో వర్షం ప్రారంభమవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆ తర్వాత వాతావరణం అనుకూలించకపోవడంతో 5:15 గంటలకు మూడో రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు. ఆట ముగిసే సమయానికి దినూశ 84 పరుగులతో, బహిరు కుమార పరుగులతో క్రీజులో ఉన్నారు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో భారత్ స్కోరు (508/9 డిక్లేర్డ్)కు ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. కేవలం రెండు వికెట్లు మాత్రమే చేతిలో ఉన్నందున, నాలుగో రోజు శ్రీలంక ఇన్నింగ్స్ ను త్వరగా ముగించి, మ్యాచ్పి పూర్తి పట్టు సాధించాలని టీమిండియా భావిస్తోంది.