Delhi Incident: ఢిల్లీ బాంబు దాడుల తరువాత, పాకిస్తాన్ భయపడి, రాజస్థాన్ సరిహద్దులో వైమానిక దళం గస్తీని ప్రారంభించింది. దాని త్రివిధ దళాల అధిపతులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ కూడా రాత్రి పొద్దుపోయే వరకు NSA మరియు ISI డైరెక్టర్ జనరల్తో సమావేశాలు నిర్వహించారు. ఇదిలా ఉంటె పేలుడు తర్వాత UK విదేశాంగ కార్యాలయం (FCDO) భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు ప్రయాణ హెచ్చరిక జారీ చేసింది. భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు నుండి 10 కిలోమీటర్ల పరిధిలో మరియు జమ్మూ మరియు కాశ్మీర్ మరియు మణిపూర్ రాష్ట్రాలకు ప్రయాణించవద్దని బ్రిటిష్ ప్రభుత్వం తన పౌరులకు సూచించింది.
ఈరోజు ఢిల్లీ బాంబు పేలుళ్లలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు, కానీ మూడు గంటల తర్వాత, హోం మంత్రి అమిత్ షా మృతుల సంఖ్య ఎనిమిది అని ప్రకటించారు. ఆ తర్వాత వచ్చిన ఆసుపత్రి జాబితాలో తొమ్మిది మంది మరణించినట్టు పేర్కొన్నారు .
అమెరికా, ఫ్రాన్స్ కూడా..
ఎర్రకోట - పర్యాటకులు రద్దీగా ఉండే ప్రాంతాల చుట్టూ తిరగకుండా ఉండాలని అలాగే ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అమెరికా రాయబార కార్యాలయం తన పౌరులకు హెచ్చరిక జారీ చేసింది. ఇదిలా ఉండగా, నవంబర్ 10న రాత్రి 7 గంటల ప్రాంతంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పేలుడు సంభవించిందని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం తెలిపింది. పేలుడుకు కారణం, మృతుల సంఖ్య ప్రస్తుతం అస్పష్టంగా ఉందని పేర్కొంది . ఢిల్లీలోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని మరియు రద్దీగా ఉండే ప్రాంతాలను మరియు సంఘటన జరిగిన ప్రదేశాన్ని నివారించాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో వారిని సంప్రదించడానికి వీలుగా ఫ్రెంచ్ ప్రయాణికులు "ఫిల్ డి'అరియన్" పోర్టల్లో నమోదు చేసుకోవాలని కూడా కోరారు.
ఈజిప్ట్ - ఇరాన్ సంతాపం..
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు దాడిపై ఇరాన్ రాయబార కార్యాలయం సంతాపం వ్యక్తం చేసింది. అధికారిక ప్రకటనలో, రాయబార కార్యాలయం ఇలా పేర్కొంది: "ఢిల్లీ పేలుడులో మరణించిన - గాయపడిన భారతీయ పౌరులకు ఇరాన్ రాయబార కార్యాలయం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది. ఈ దుఃఖ సమయంలో భారత ప్రభుత్వం, భారత ప్రజలకు మేము అండగా నిలుస్తాము".
మరోవైపు ఈజిప్టు రాయబార కార్యాలయం తన సందేశంలో , "ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో ప్రభావితమైన కుటుంబాలకు మరియు ప్రియమైనవారికి మా ప్రజలు మరియు ప్రభుత్వం తరపున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. బాధితులతో మా ప్రార్థనలు ఉన్నాయి మరియు గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము." అంటూ పేర్కొంది.