ఇటీవల కాలంలో అమ్మాయిలు తమ పట్టుదలను ఏమాత్రం వదలడం లేదు. బలవంతంగా తల్లిదండ్రులు పెళ్లి చేస్తే.. కట్టుకున్నవాడికి చుక్కలు చూపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఇటీవల తన భర్తను సుపారీ ఇచ్చి దగ్గరుండి మరీ చంపించిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక అమ్మాయి పెళ్లయిన మొదటి రాత్రే భర్తకు చుక్కలు చూపెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టించింది.
ఒక నవ వధువు తన మొదటి రాత్రి గదిలోకి ప్రవేశించి, "నన్ను ముట్టుకుంటే, నిన్ను 35 ముక్కలుగా నరికివేస్తాను" అని తన భర్తను బెదిరించిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. 26 ఏళ్ల కెప్టెన్ నిషాద్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందినవాడు. అతను కరాచన దిహా గ్రామానికి చెందిన సితార అనే యువతిని ఏప్రిల్ 29న వివాహం చేసుకున్నాడు. మే 2న వారి వివాహ రిసెప్షన్ జరిగింది.
ఈ రిసెప్షన్ కు హాజరైన బంధువులు, స్నేహితులు సంతోషంగా ఉన్నప్పటికీ, వరుడి ముఖంలో ఆందోళన కనిపించింది. అది అతని భార్య నుండి వచ్చిన ప్రాణహాని అని అతనికి తప్ప అక్కడ ఉన్న ఎవరికీ తెలియదు. రిసెప్షన్ అయిపోయాకా.. మర్నాడు కుటుంబంలోని వ్యక్తులు అతన్ని అలా ఎందుకున్నావని పదే పదే ప్రశ్నించగా.. అసలు విషయం బయటపెట్టాడు.
మా పెళ్లి జరిగిన మొదటి రాత్రి, నా భార్య ముఖం కప్పుకుని కూర్చుంది. ఆమె చేతిలో పదునైన కత్తి ఉంది. "నువ్వు నన్ను ముట్టుకుంటే, నిన్ను 35 ముక్కలుగా నరికివేస్తాను. నేను నా ప్రేమికుడు అమన్ కు చెందినదానిని" అని ఆమె కోపంగా బెదిరించింది అంటూ చెప్పాడు. అంతేకాదు.. నాకు ఏమీ అర్థం కాలేదు. నేను భయంతో కుంగిపోయి కూర్చున్నాను. ఆమె అర్ధరాత్రి పడుకున్న తర్వాతే నేను పడుకున్నాను అని వివరించాడు.
"గత నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నాకు భయంగా ఉంది" అని నిషాద్ తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఇది విన్న నిషాద్ కుటుంబం ఆగ్రహానికి గురై, సితార, ఆమె కుటుంబ సభ్యులను మాట్లాడటానికి పిలిచింది. అప్పుడు అందరిముందూ సితార నన్ను బలవంతం చేయడం వల్లే ఈ పెళ్ళికి అంగీకరించాను. నేను అమన్ తో ప్రేమలో ఉన్నాను అని ఖరాఖండిగా చెప్పింది. అంతే కాదు ఈ శరీరం అతనికి మాత్రమే సొంతం అంటూ ఓ సినిమా డైలాగ్ వదిలింది. దీంతో అందరూ షాక్ అయ్యారు.
ఆ తరువాత, గత నెల 25న, రెండు కుటుంబాలు గ్రామ నాయకుల సమక్షంలో సితారతో మాట్లాడి.. అమన్ను మరచిపోయి నిషాద్తో వివాహ జీవితాన్ని ప్రారంభించమని ఆమెను ఒప్పించారు. ఈ విషయంలో వారు ఆమె నుండి ఒక ఒప్పంద లేఖను కూడా తీసుకున్నారు. ఇక్కడితో స్టోరీ అయిపోలేదు.
ఇక్కడ నుంచి అసలు కథ మొదలైంది. సితార తన భర్త నిషాత్ను బెదిరించడం కొనసాగించింది. తాను తన ప్రేమికుడితో పంపించేయాలని.. లేకపోతే చంపేస్తానని బెదిరించింది. నిషాత్ పగలు-రాత్రులు మరణ భయంతో గడిపాడు.
ఈ నేపథ్యంలో, సితార 30వ తేదీన నిషాద్ ఇంటి నుంచి పారిపోయింది.
ఇంటి సీసీటీవీ ఫుటేజీలో ఆమె ఇంటి వెనుక గోడ ఎక్కి దూకుతున్నట్లు కనిపించింది, ముందు తలుపు తాళం వేసి ఉంది. దీంతో ఈ విషయం పోలీస్ స్టేషన్ కు చేరింది. అప్పుడే బయటి ప్రపంచానికి తెలిసింది. ఇలాంటి పరిస్థితిలో ఏమిచేయలీక పోలీసులు రెండు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చి పంపించేశారు. ఎటువంటి కేసు నమోదు చేయలేదు.