11వ యోగా దినోత్సవ కార్యక్రమం విశాఖపట్నంలో అత్యద్భుతంగా జరిగింది. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ తో సహా రాష్ట్ర, దేశ ప్రముఖులు అందరూ విశాఖ సాగర తిరాన జరిగిన యోగా ఉత్సవానికి హాజరయ్యారు. దాదాపు 300,000 మందికి పైగా ప్రజలు రావడం అందరూ ఏకకాలంలో యోగా అభ్యాసం చేయడం అందమైన దృశ్యాన్ని ఆవిష్కరించింది. అందరూ యోగాలో పాల్గొన్నారు. దాని గురించి చాలా నేర్చుకున్నారు. అయితే, యోగా ఉత్సవానికి హాజరైన ప్రతి ఒక్కరికీ యోగా మ్యాట్లు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన యోగా మ్యాట్లపై అందరూ యోగా చేశారు. మొత్తంగా యోగా కార్యక్రమం ఒక పండుగలా ఉంది. కానీ అసలు విషయం ఇక్కడే ప్రారంభమైంది. అంటే... యోగా కార్యక్రమం పూర్తయిన తర్వాత, అందరూ యోగా మ్యాట్లు ఇస్తున్న వారి వద్దకు వెళ్లి వాటిపైకి దూకారు. ఈ సమయంలో, మహిళలు మ్యాట్ల కోసం యుద్ధానికి దిగారు.
నిజానికి యోగా ఆంధ్ర కోసం ప్రభుత్వం పెద్ద ఏర్పాట్లు చేసింది. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఒక మ్యాట్ ను అందజేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అన్నట్టుగానే అందరికీ ఒక్కో మ్యాట్ ను ఇచ్చారు, అయితే, కార్యక్రమం జరిగిన తరువాత యోగాలో పాల్గొన్న వాళ్ళు మ్యాట్ల కోసం పోటీ పడ్డారు. కొంతమంది తమ మ్యాట్ తో పాటు పక్క వారి మ్యాటీలను కూడా లాక్కోవాలని ప్రయత్నించారు. దీంతో అక్కడంతా గందరగోళం చెలరేగింది. ఒకరిపై ఒకరు పడి కొట్టుకుంటూ.. ఒకరిని ఒకరు తోసుకుంటూ మ్యాట్లను చేజిక్కించుకోవాలని ప్రయత్నించారు. మినీ యుద్ధమే అక్కడ జరిగింది. ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆ వీడియో మీరు ఇక్కడ చూడొచ్చు.
Highlights of #Yogandhra
pic.twitter.com/AWeCRTjnaC https://t.co/Li52Ky3KsC
— Sukkumarkk (@StrictlyAsking) June 21, 2025