కెప్టెన్ శుభాన్షు శుక్లా ఈ మధ్య ఈ పేరు బాగానే వినిపిస్తోంది కదూ. మొదటి సారిగా భారత్ నుంచి అంతరిక్ష కేంద్రం ISS చేరుకున్న వ్యక్తిగా వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. చాలామందికి ISS కి వెళ్లడంలో అంత ప్రత్యేకత ఏమిటి? అసలు అక్కడికి వెళ్లి ఏమి చేస్తారు? 14 రోజుల్లో అక్కడ ఏమి సాధిస్తారు?మన దేశానికి ఈయన్ను అంతరిక్షానికి పంపితే వచ్చే లాభం ఏమిటీ? పైగా 548 కోట్లు ఖర్చు పెట్టి మరీ ఎందుకు పంపించారు? ఇలాంటి అనుమానాలు ఎన్నో వస్తాయి. ఈ స్టోరీలో ఆ అనుమానాలన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాం.
అసలు శుబాన్షు శుక్లాను ఇప్పుడు అంతరిక్షానికి ఎందుకు పంపించారు తెలుసుకోవాలంటే ముందు మనం ఇస్రో గన్ యాన్ గురించి తెలుసుకోవాలి. 2027లో ముగ్గురు వైమానిక దళ పైలట్లను ఒక అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి పంపుతారు. ఈ పైలట్లు 400 కి.మీ కక్ష్యలో 3 రోజులు ఉంటారు, ఆ తర్వాత అంతరిక్ష నౌకను హిందూ మహాసముద్రంలో ల్యాండ్ చేస్తారు. ఈ మిషన్ ఖర్చు దాదాపు రూ.20,193 కోట్లు. వారిలో ఒకరు గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా. వారందరికీ అంతరిక్ష ప్రయాణానికి శిక్షణ ఇస్తున్నారు. గగన్యాన్ ద్వారా పైలట్లను అంతరిక్షంలోకి పంపే ముందు, ఇస్రో రెండు ఖాళీ పరీక్షా విమానాలను పంపుతుంది. మూడవ ప్రయోగంలో ఒక రోబోట్ను పంపుతారు. దాని విజయం తర్వాత, నాల్గవ ప్రయోగంలో మానవులు అంతరిక్షంలోకి వెళ్లగలుగుతారు. ఈ సంవత్సరం చివరి నాటికి మొదటి పరీక్షా విమానాన్ని పంపవచ్చు.
అంతరిక్ష పరిస్థితుల్లో జీవించడానికి అవసరమైన విధానాలు నేర్చుకునేందుకు వీరికి శిక్షణ ఇస్తున్నారు. అయితే, ఈ శిక్షణ సిమ్యులేటర్ పై ఇస్తున్నారు. సిమ్యులేటర్ అంటే మిషెన్ లాంటిది. దీనిలో అంతరిక్షంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసి ఉంటాయి. అయితే వీరికి నిజమైన అంతరిక్ష పరిస్థితులు పరిచయం చేయడానికి ప్రత్యేకంగా అంతరిక్షంలోకి కూడా పంపిస్తారు. కానీ, అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం.
ఇప్పుడు శుభాన్షు శుక్లా వెళ్లిన ఆక్సియాం - 4 మిషన్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక ప్రయివేట్ అంతరిక్ష మిషన్. దీనిని అమెరికన్ అంతరిక్ష సంస్థ ఆక్సియం, NASA - SpaceX ల పార్ట్నర్ షిప్ లో నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ తన అంతరిక్ష నౌకలో ప్రైవేట్ వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అంటే ISS కి పంపుతుంది. ఇప్పటికే మూడు విమానాలు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి వచ్చాయి. ఇప్పుడు ఇది నాలుగోది. దీనిలోనే శుభాన్షు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లారు. అమెరికా, పోలాండ్,హంగేరీ నుండి వ్యోమగాములు ఉన్నారు. ఈ విమానంలో వెళ్ళడానికి సీటుకు కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. కానీ, భారత్ నుంచి ప్రత్యేకంగా విమానం పంపించేదానికన్నా ఖర్చు తక్కువ అవుతుంది అందుకే ఇస్రో శుభాన్షు ను ఈ మిషన్ ద్వారా పంపింది.
ఇక్కడ వరకూ అర్ధం అయింది కదా..
ఇప్పుడు శుభాన్సు శుక్లా 14 రోజులు అంతరిక్షంలో ఏమి చేస్తారు? తెలుసుకుందాం.
యాక్స్-4 మిషన్లోని ఆస్ట్రోనాట్స్ 14 రోజుల పాటు ISSలో ఉంటారు. ఈ సమయంలో, వారు 60 సైటిఫికల్ ఎక్స్పరిమెంట్స్ చేస్తారు. శుభాన్షు శుక్లా కూడా వీటిలో 7 ప్రయోగాలు చేస్తారు.
దీనితో పాటు, శుభాన్షు నాసాతో కలిసి మరో 5 ప్రయోగాలు చేస్తాడు, అందులో ఆయన సుదీర్ఘ అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన డేటాను సేకరిస్తారు. ఈ మిషన్లో చేసిన ప్రయోగాలు భారతదేశ గగన్యాన్ మిషన్ను బలోపేతం చేస్తాయి. శుభాన్షు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ISS విద్యార్థులతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. తన ISS అనుభవాలు, పని గురించి విద్యార్థులకు ఆయన చెప్పగలరు.
గ్రూప్ కెప్టెన్ గా అంతరిక్షంలోకి వెళ్లిన శుభాన్షు తన టీమ్ లో మిగిలిన ముగ్గురికి అంతరిక్షంలో వస్తావ పరిస్థితులపై అవగాహన కల్పించగలుగుతారు. వీరు నలుగురు అంతరిక్షంలోకి వెళ్లే గగన్ యాన్ విజయవంతం కావడానికి వీరందరికీ అక్కడి పరిస్థితులు పూర్తిగా అవగాహన కావడం అవసరం. అందుకే ఇప్పుడు శుభాన్షు శుక్లాను అంత ఖర్చు పెట్టి అంతరిక్షంలోకి పంపించారు. ఆయన ప్రయాణం విజయవంతం అవ్వాలని ఇస్రో తలపెట్టిన గగన్ యాన్ సక్సెస్ అయి ప్రపంచంలో మన దేశ ప్రతిష్ట మరింత పెరగాలని కోరుకుందాం. జై హింద్.