టీ 20 ప్రపంచ కప్ 2026 లో సూపర్ 8 దశ పోటీ ఫిబ్రవరి 21న ప్రారంభమవుతుంది. తదుపరి దశకు చేరుకునే ఎనిమిది జట్లను నాలుగు జట్లు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. టీం ఇండియా తన నాలుగు మ్యాచ్ ల్లోనూ గెలిచి గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో, టీం ఇండియా స్పష్టంగా బాగా రాణిస్తోంది, కానీ ఖూూ, నెదర్లాండ్స్ వంటి జట్లు భారత బౌలింగ్ లోపాలను బహిర్గతం చేశాయి. ఇది కాస్త ఆందోళన కలిగిస్తోంది. గ్రూప్ దశలో, ఇషాన్ కిషన్ నుంచి వరుణ్ చక్రవర్తి, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వరకు అందరూ బాగా రాణించారు. అయితే, కొంతమంది ఆటగాళ్ళు అంచనాలను అందుకోలేకపోయారు. వారి ప్రదర్శన ఆధారంగా సూపర్ 8 నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. వారిలో ముగ్గురు ఆటగాళ్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తోంది. 2025లో అభిషేక్ శర్మ 859 పరుగులు చేశాడు. అదే బ్యాట్స్మన్ 202620 ప్రపంచ కప్ లో మొదటి మూడు ఇన్నింగ్స్లలో తన ఖాతా తెరవడంలో విఫలమయ్యాడు. దీంతో ఏం జరుగుతోందనే అనుమానం చాలా మందిలో కనిపిస్తోంది. ప్రపంచ కప్లో అభిషేక్ శర్మ ఇప్పటికే 0 పరుగులకే హ్యాట్రిక్ అవుట్లను సాధించాడు. గ్రూప్ దశ కంటే సూపర్ 8 దశ చాలా కఠినంగా ఉంటుంది. జట్టుకు గట్టి సవాల్గా మారనుంది. అభిషేక్ పేలవమైన ఫామ్ టీమ్ ఇండియా ప్రపంచ కప్ గెలవాలనే ఆశలకు ఆటంకం కలిగించక ముందే అతన్ని ప్లేయింగ్ 11 నుంచి తొలగించే అవకాశం ఉంది. గ్రూప్ దశలో రింకు సింగ్ నాలుగు మ్యాచ్లు కూడా ఆడాడు. USAతో జరిగిన మ్యాచ్లో, అతను 14 బంతుల్లో కేవలం 6 వరుగులు మాత్రమే చేయగలిగాడు. అప్పటి నుంచి అతను మూడు ఇన్నింగ్స్లలో 6, 4, 4 బంతులను ఎదుర్కొన్నాడు. అతనికి ఎక్కువగా 7 స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్నాడు. కానీ వాషింగ్టన్ సుందర్ రాకతో, రింకును ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తొలగించవచ్చు. రింకు ఎక్కువ బంతులు ఆడలేదు, కాబట్టి అతను పెద్దగా ప్రభావం చూవలేకపోయాడు. అయితే, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్లో కూడా ఇలాంటి పాత్ర పోషించగలడు, అతని రాక బౌలింగ్ విభాగాన్ని పటిష్టం అవుతుంది. అర్షదీప్ సింగ్ ఆడతాడా లేదా కొత్త ఆటగాడు ఆడతాడా అనేది పిచ్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. శ్రీలంకలో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో, టీమ్ ఇండియా అర్ష్ పన్ను పక్కనపెట్టి, అదనపు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లు జస్ప్రిత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఇద్దరు ప్రధాన పేసర్ల పాత్ర పోషిస్తున్నారని స్పష్టంగా చూపించాయి. భారత్ మొదటి సూపర్ 8 మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది, కానీ రెండో మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది. ఇక్కడ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. భారత జట్టులోకి అర్హదీప్ను డ్రాప్ చేసి అదనపు స్పిన్నర్ను జట్టులోకి తీసుకుంటే ఆశ్చర్యం లేదు.