రష్యా అధ్యక్షుడికి మోడీ విజ్ఞప్తి
ఒకే కారులో మోడీ, పుతిన్ ప్రయాణం
మాపై అమెరికా పోరును ఆపించండి
ప్రధానికి ఇరాన్ అధ్యక్షుడి అభ్యర్ధన
పుతిన్ చైనా అధ్యక్షుడి భేటీ
బిష్కెక్లో ఎస్సీఓ నేపథ్యంలో ప్రపంచ నేతల కీలక భేటీలు
కిర్గిజెన్లో షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా కిర్గిజాస్తాన్ రాజధాని బిష్కెక్లో ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ద్వైపాక్షిక భేటీ జరిపారు. ఉక్రెయిన్ సంఘర్షణను శాంతియుతంగా పరిష్క రించే ప్రయత్నాలన్నింటికీ భారత్ మద్దతు ఇస్తుందని, ఇలాగే కొనసాగిస్తుందని సంయుక్త ప్రకటనలో మోడీ చెప్పారు. అంతులేని యుద్ధం నుంచి యుద్ధాంతం వైపు వెళ్లాలని ప్రధాని పేర్కొన్నారు. ఈ యుద్ధం త్వరగా మ-ఎగియాలనేది మానవాళి కోరిక అని అన్నారు. గత సమావేశంలో పుతిన్ పరిస్థితిని వివరంగా చెప్పారని, భారత్ శాంతియుత మార్గా లన్నింటికీ మద్దతు ఇస్తుందని చెప్పారు. అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాలని భారత్ వాదిస్తుందని, అది మానవాళికి అవసరమని అన్నారు. యుద్ధంలో గడిపిన ప్రతి రోజు మానవాళిని వెనక్కి వెడుతుందని, శాంతి వైపు వేసిన ప్రతి అడుగు కొత్త ఆశను నింపుతుందని మోడీచెప్పారు. గాంధీ భూమి, బుద్ధ భూమి ఒకే సందేశం ఇస్తాయ ని, అది శాంతి మార్గమని అన్నారు. గతేడాది పుతిన్ భారత పర్యటన విజయవంతమైందని, ఆర్ధిక సంబంధాలు బలపడ్డాయని పేర్కొన్నారు. రక్షణ, వాణిజ్యం, మౌలిక నదు పాయాలు, పర్యాటకం విషయాలు చర్చలో వచ్చాయి. 2025 లో ఇరు దేశాల మధ్య పర్యాటక మార్పిడి 16 శాతం పెరిగిం దని సమాచారం. సెప్టెంబర్లో న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సుకు పుతిన్ న్ను భారత్ ఆహ్వానించింది.
ఒకే కారులో మోడీ, పుతిన్ ప్రయాణం
బిష్కెక్లో ద్వైపాక్షిక భేటీ పూర్తయిన తర్వాత మోడీ, పుతిన్ ఆరవ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవానికి ఒకే కారులో వెళ్లారు. నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవం స్థానిక సమయం రాత్రి 9 గంటలకు బిష్కెక్ అరేనాలో జరిగింది. భారత్ 87 మంది బృందంతో పాల్గొంటోంది. వీరిలో 73 మంది క్రీడాకారులు ఉన్నారు. మోడీ, పుతినగతంలోకూడా ఒకే వాహనంలో ప్రయాణించారు. 2025లో చైనా తియాన్టన్ సదస్సు తర్వాత పుతిన్ జరన్ సెనాట్ కారులో, తర్వాత ఢిల్లీలో టయోటా ఫార్చ్యూనర్ లో కలిసి వెళ్లారు. బిష్కెక్లో కూడా భేటీ తర్వాత నోమాడ్ గేమ్స్కు కలిసి వెళ్లడం ఆ సన్నిహిత సంబంధాన్ని చూపించింది.
అమెరికా పోరు ఆపండి: ఇరాన్
షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా కిర్గిజాజన్లో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి యుద్ధం నుంచి పక్షాలను దూరం చేసేందుకు భారత విస్తృత దౌత్య సంబంధాలను వాడాలని కోరారు. ఫి బ్రవరిలో పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత ఇద్దరి మధ్య తొలిసారిగా భేటీ జరిగింది. ఇరాన్ ప్రకటన ప్రకారం పెజెష్కియాన్ ఇటీపలి యుధ్ధంలో భారత్ ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞత తెలిపారు. ప్రాంతంలో, ప్రపంచంలో భారత స్థానం, సామర్థ్యాలు, రెండు దేశాల చారిత్రక, సాంస్కృతిక బంధాలను ప్రస్తావించి, వివిధ పక్షాలతో ఉన్న సంప్ర దింపులను వాడి యుద్ధం, రక్తపాతం నుంచి సంభాషణ. ఒప్పందం వైపు తీసుకెళ్లాలని అభ్యర్థించారు. అమెరికా దౌత్య మార్గాలకు బదులు యుద్ధ మార్గం ఎంచుకుందని ఆయన ఆరోపించారు. యుద్ధం ఇరాస్కు, ప్రాంతానికి, మానవాళికి లాభం కాదని చెప్పారు. ఇటీవలి కష్టకాలంలో ఇరాన్తో సహ కారం, సంప్రదింపులు కొనసాగించామని మోడీ చెప్పారు. పెజెష్కియాన్ను శాంతి ప్రియుడిగా అభివర్ణించి, శాంతి ప్రయత్నాల్లో పాత్ర పోషించ గలరని అన్నారు. కొందరికి యుద్ధం కొనసాగడంలో లాభం ఉందని అంగీకరిస్తూ, శాంతి కోసం ప్రయత్నాలు పెంచాలని, చివరకు శాంతి, భద్రత నెలకొంటాయని నమ్మకం వ్యక్తం చేశారు. లారక్ ద్వీపంపై అమెరికా దాడి చేసిన మరుసటి రోజు బేటీ జరిగింది. వాణిజ్య వైవిధ్యం, చాబహార్, నావికుల భద్రత కూడా చర్చలో వచ్చాయి. దీర్ఘకాల స్నేహాన్ని బలోపేతం చేస్తామని, వాణిజ్య సంబంధాలను విస్తరిస్తామని మోడీచెప్పారు. ఆంక్షల ప్రభావాన్ని తగ్గించి రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, సాంస్కృతిక సహకారం పెంచేందుకు సిద్దమని పెజెష్కియాన్ పేర్కొన్నారు.
చైనా-రష్య మధ్య నో వీసా జర్నీకి సై
షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా కిర్గిజెన్ రాజధాని బిష్కెక్లో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం భేటీ అయి, రెండు దేశాల మధ్య వీసా రహిత ప్రయాణ విధానాన్ని శాశ్వతం చేయడంపై చర్చించారు. అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నారు. రష్యా ప్ర భుత్వ సంస్థ టాస్ ప్రకారం చైనా వైపు సాధ్యమని, ఉ పయోగకరమని భావిస్తే వీసా రహిత విధానాన్ని శాశ్వతం చేయడానికి, కలిసి పనిచేయడానికి రష్యా సిద్ధమని పుతిన్ " చెప్పారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో పర్యాటక ప్రవాహం 43 శాతం పెరిగిందని పేర్కొన్నారు. చైనా పౌరులు 30 రోజుల వరకు వీసా లేకుండా రష్యాలో ఉండేందుకు. సెప్టెంబర్ 14,2026 వరకు అనుమతించే ఆదేశాన్ని డిసెంబర్ 1. 2025న పుతిన్ జారీ చేశారు. ఇది వరస్పర సూత్రంపై ఉంది. చైనా ముందుగానే రష్యన్లకు ఇలాంటి ఏర్పాటు చేసింది. తర్వాత ఇరుపక్షాలు 2027 చివరి వరకు పొడిగించాయి. పురోగతి స్థిరంగా ఉంటుందని, భవిష్యత్తు వ్యూహాత్మక మార్గదర్శకత్వం, ఉమ్మడి ప్రయత్నాలతో చైనా, రష్యా సంబంధాల పునాది మరింత బలవడుతుందని, మరింత వెలుగులో ఉంటుందని జిన్సెంగ్ చెప్పారు. నేపాల్- చైనా సరిహద్దు వరదల్లో మృతులకు సంతాపం ప జీతిన్ తెలిపారు. ఉక్రెయిన్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని క్రెమ్లిన్ చెప్పింది. ఈ ఏడాది ఇద్దరి మధ్య జరిగిన రెండో ప్రత్యక్షభేటీ ఇది.