'వుష్ప' ప్రాంచైజీతో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన తదుపరి ప్రాజెక్ట్లతో భారతీయ సినీ పరిశ్రమలో తీవ్రమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్ లో ఉన్న చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కోలీవుడ్ సంచలన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.23గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే, దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జును జోడీగా పూజా హెగ్దేను తీసుకోనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.ఒకవేళ ఈ వార్త నిజమైతే, అల్లు అర్జున్ - పూజా హెగ్దే కాంబినేషన్లో ఇది మూడో చిత్రం అవుతుంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన 'దువ్వాడ జగన్నాథం', 'అల వైకుంఠపురములో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' ఇండస్ట్రీ హిట్గా నిలవడమే కాకుండా వారి మధ్య కెమిస్ట్రీ, 'బుట్టబొమ్మ' పాట దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ఈ హిట్ పెయిర్ మళ్లీ కలిస్తే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో 'రాకా' అనే పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ నటిస్తున్నారు. ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో '23' పట్టాలెక్కనుంది. లోకేశ్ తన సినిమాల్లో హీరో పాత్రలతో పాటు హీరోయిన్ పాత్రలను కూడా ఎంతో బలంగా, ప్రభావవంతంగా తీర్చిదిద్దుతారనే పేరుంది. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన 'కూలీ' చిత్రంలో పూజా హెగ్దే 'మోనికా' పాటలో కనిపించి అలరించడం కూడా ఈ ఊహాగానాలకు బలాన్నిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ను లోకేశ్ తనదైన మార్క్ ఇంటెన్స్ యాక్షన్తో ఎలా చూపిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, పూజా హెగ్దే ఎంపికపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నప్పటికీ, చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అభిమానులు ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.