శ్రీలంకపై 1-0తో సిరీస్ గెలిచిన భారత్
యువ ఆటగాళ్ల ప్రదర్శనపై గిల్ సంతోషం
వడిక్కల్ రెండు సెంచరీలతో 328 వరుగులు
సిరీస్లోలో మానవ్ సుతార్ కు 16 వికెట్లు
గాలే టెస్టులో సుతారు వది వికెట్ల ఘనత
శ్రీలంకపై టెస్టు సిరీస్ గెలిచిన తర్వాత భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ సంతోషం వ్యక్తం చేశాడు. రెండు టెస్టుల సిరీస్లో 1-0తో విజయం సాధించడం ఆనందంగా ఉ ందన్నాడు. రెండో టెస్టు డ్రాగా ముగిసినా, ఈ పర్యటనలో జట్టుకు ఎన్నో మంచి అంశాలు కనిపించాయని తెలిపాడు. ముఖ్యంగా యువ ఆటగాళు దేవత్ పడిక్కల్, మాసవ్ సుతార్ రాణించడం తనను ఆకట్టుకుందని చెప్పాడు. సాయి సుదర్శన్ స్థానంలో మూడో నంబర్ లో బ్యాటింగ్కు వచ్చిన పడిక్కల్ సిరీస్లో అదరగొట్టాడు. రెండు సెంచరీలతో 328 పరుగులు చేశాడు. క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత పెద్ద ఇన్నింగ్స్ లు ఆడాలని బ్యాటర్లకు చెబుతుంటామని గిల్ అన్నాడు. పడిక్కల్ అదే చేసి చూపించాడని ప్రశంసించాడు. అతడి ఆట జట్టుకు మంచి సంకేతమని తెలిపాడు. ఎడమచేతి స్పిన్ ఆల్రౌండర్ మాసవ్ సుతార్పైనా గిల్ ప్రశంనలు కురిపించాడు. సిరీస్లో 16 వికెట్లు తీసిన సుతార్ గాలే టెస్టులో పది వికెట్లతో భారత్ 165 పరుగుల విజయానికి కీలకంగా నిలిచాడు. అతడు భవిష్యత్తులో భారత స్పిన్ దాడికి చాలా కాలం నాయకత్వం వహించే ఆటగాడిగా ఎదుగుతాడని గిల్ విశ్వాసం వ్యక్తం చేశాడు. బౌలింగ్కు వచ్చిన ప్రతిసారీ వికెట్లు తీసే అవకాశం కల్పిస్తున్నాడని అన్నాడు. రెండో టెస్టు డ్రా కావడం మాత్రం నిరాశ కలిగించిందని గెల్ చెప్పాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి గెలుస్తామని భావించామని తెలిపాడు. కానీ చివరి మూడు రోజులు శ్రీలంక అద్భుతంగా పోరాడిందని ప్రశంసించాడు. ప్రత్యర్థి ఆట నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలని అన్నాడు. ఈ సిరీస్ నుంచి మంచి అనుభవం దక్కిందని, న్యూజిలాండ్లో జరిగే సిరీస్లో మరింత మెరుగ్గా ఆడతామని గిల్ ధీమా వ్యక్తం చేశాడు.