తమ జట్టు 2026 టీ20 ప్రపంచ కప్ లో పాల్గొంటుందని, అయితే ఫిబ్రవరి 15న శ్రీలంకలో భారత్తో జరిగే మ్యాచ్ కోసం మైదానంలోకి దిగదని పాకిస్తాన్ ప్రభుత్వం గత ఫిబ్రవరి 01న అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత క్రికెట్ ప్రపంచంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాస్తవానికి పాకిస్తాన్ తెలివి తక్కువగా ఇంత పెద్ద ప్రకటన చేసింది, కానీ దీనివల్ల కలిగే నష్టాన్ని వారు ఊహించలేదు. అని మాజీ క్రికెటర్లు అంటున్నారు. భారత్తో మ్యాచ్ను బహిష్కరించడం వల్ల పాకిస్తాన్కు 5 పెద్ద నష్టాలు ఉన్నాయి. దైనిక్ జాగరణ్ ప్రకారం, పాకిస్తాన్ ఈ నిర్ణయం ప్రకటించడం అంటే భారత్తో మ్యాచ్ను బహిష్కరించినందుకు ప్రపంచ కప్ నుండి ఆ జట్టుపై నిషేధం పడవచ్చు. టోర్నమెంట్ నుండి బంగ్లాదేశ్ ఇప్పటికే తన పిచ్చి నిర్ణయం కారణంగా నిష్క్రమించింది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రపంచ కప్ నుండి నిషేధం ఎదుర్కొనే ప్రమాదంలో పడింది. భారత్తో మ్యాచ్ను బహిష్కరించినందుకు పాకిస్తాన్ ఆదాయంపై కూడా ఐసిసి నిషేధం విధించవచ్చు. నివేదికల ప్రకారం, ఐసిసి ద్వారా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంవత్సరానికి 34.51 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 316 కోట్ల రూపాయలు) ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం నిలిచిపోతే పాకిస్తాన్ పూర్తిగా దివాలా తీసినట్లే. భారత్ తో మ్యాచ్ ఆడకపోతే, పాకిస్తాన్ జట్టు జియోస్టార్ు నష్టపరిహారం చెల్లించాల్సి రావచ్చు. ప్రపంచ కప్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ద్వారా అత్యధికంగా సంపాదన వస్తుంది. ఈ మ్యాచ్లో 10 సెకన్ల ప్రకటన స్లాట్ సైతం చాలా ఖరీదైనది. మ్యాచ్ జరగకపోతే వారికి చాలా నష్టం వాటిల్లుతుంది. పాకిస్తాన్ మీద ద్వైపాక్షిక సిరీస్లపై కూడా పూర్తి నిషేధం విధించవచ్చు. ఈ నిషేధంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరింత దివాళా తీస్తుంది. ప్రపంచ కప్లో భారత్తో మ్యాచ్ను బహిష్కరించడం వల్ల పాకిస్తాన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ లో సైతం నష్టపోవచ్చు. వాస్తవానికి, టోర్నమెంట్ కోసం విదేశీ ఆటగాళ్ల ఎన్ఎసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్పై నిషేధం విధించవచ్చు. భారత్ తో మ్యాచ్ లు ఆడకూడదనే నిర్ణయం గురించి పిసిబి ఇంకా ఐసిసికి తెలియజేయలేదని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ బహిష్కరణను పిసిబి అధికారికంగా ఐసిసికి తెలియజేసిన తర్వాతే చర్యలు చేపడుతుంది.. 2026 టి 20 ప్రపంచ కప్ నుండి పాకిస్తాన్ ను మినహాయించవచ్చు అని ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ టి 20 లీగ్ (పిఎస్ఎల్) లో విదేశీ ఆటగాళ్లకు ఎన్ఎసిలు ఇవ్వడానికి కూడా ఐసిసి నిరాకరించవచ్చు. బంగ్లాదేశ్ ను వెనకుండి ప్రోత్సహించిన కారణంగా, వారికి ఓ న్యాయం, తమకు ఓ న్యాయం ఉ ండదని చెప్పడానికి.. బంగ్లా దారిలో పయనించి పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఐసిసి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తమ మ్యాచ్ లను భారత్ వెలుపల తరలించడానికి నిరాకరించిన తరువాత టి 20 ప్రపంచ కప్ లో పాల్గొనకూడదని బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. దీని తరువాత, పాకిస్తాన్ ఆటగాళ్ళు, పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ ఐసిసిని విమర్శించారు. టోర్నమెంట్ ను బహిష్కరిస్తాం అన్నారు. అయితే, సెమీఫైనల్ లేదా ఫైనల్లో భారత్లో మ్యాచ్ ఉంటే ఏం చేయనున్నారో పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. అప్పుడు వారు ఆడతారా లేదా? ప్రస్తుతం పాక్ ప్రభుత్వం ఫిబ్రవరి 15న జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరిస్తామని మాత్రమే ప్రకటించి అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది.