అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిలేట్స్ పర్యటన రాష్ట్రానికి ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్స్లో ట్వీట్ పెట్టారు. అమరావతి పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆత్మీయ స్వాగతం పలకడం ఆనందంగా ఉందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి బిలేట్స్కు ఆత్మీయ స్వాగతం పలకడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పేదరిక నిర్మూలన వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు విశేషమని పవన్ కల్యాణ్ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యానికి చూపుతున్న నిబద్ధతను పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించబోతోందని పేర్కొన్నారు. విద్యారంగంలో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం విద్యార్థులకు ఆధునిక విద్యను అందించడంలో సహాయపడుతుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ ఆధారిత విద్య, డిజిటల్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బోధన వంటి విధానాలు విద్యార్థుల నైపుణ్యాలను పెంచడంలో కీలకంగా ఉంటాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో కూడా ఈ భాగస్వామ్యం ఉపయోగపడు తుందని చెప్పుకొచ్చారు. ఆరోగ్య రంగంలో గేట్స్ ఫౌండేషన్ సహకారం ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడంలో కీలక పాత్ర పోషించబోతోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గేట్స్ ఫౌండేషన్ అనుభవం రాష్ట్రానికి ఉ పయోగపడుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను విస్తరించడం, టెక్నాలజీ ఆధారిత ఆరోగ్య సేవలను అందించడం వంటి అంశాల్లో భాగస్వామ్యం కీలకమని అన్నారు. వ్యవసాయ రంగంలో కూడా గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం రైతులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. టెక్నాలజీ ఆధారిత వ్యవసాయం, డ్రోన్ వినియోగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పంటల విశ్లేషణ వంటి విధానాలు రైతుల ఆదాయాన్ని పెంచడంలో సహాయపడతాయని చెప్పుకొచ్చారు. వ్యవసాయాన్ని లాభదాయక రంగంగా మార్చడంలో ఈ భాగస్వామ్యం ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. బిలేట్స్ అమరావతి పర్యటన ద్వారా ఆంధప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న టెక్నాలజీ ఆధారిత పాలన, అభివృద్ధి కార్యక్రమాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర, స్థిర అభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతోందని వివరించారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో గేట్స్ ఫౌండేషన్ సహకారం కీలకమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.