రోహిత్ అద్భుతంగా ఆడుతున్నాడన్న సైకియా
వన్డే జట్టులో స్థానానికి తక్షణ ముప్పు లేదని సంకేతాలు
లార్డ్స్ రోహిత్ సెంచరీతో మారిన సమీకరణాలు
బీసీసీఐ సమీక్ష అనంతరం సైకియా కీలక వ్యాఖ్యలు
రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ చెక్ పెట్టింది. టీమిండియా మాజీ కెప్టెన్ అద్భుతంగా ఆడుతున్నాడని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. రోహిత్ భవిష్యత్తుపై అనవసరమైన ఊహాగానాలకు ఆజ్యం పోయొద్దని సూచించారు. దీంతో ప్రస్తుతానికి పన్డే జట్టులో రోహిత్ స్థానానికి ఎలాంటి ముప్పు లేదన్న సంకేతాలు వెలువడ్డాయి. గురువారం ముంబైలో జరిగిన బీసీసీఐ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం అనంతరం సైకియా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, పన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్, టీ20 కెప్టైడ్ కేయస్ అయ్యర్, వీసీసీఐ అధ్యకుడు మిథున్ మన్హాస్, కార్యదర్ని దేవజిత్ సైకియా హాజరయ్యారు. అయితే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సమావేశానికి రాలేదు. ఆయన పదవీకాలం అక్టోబర్లో ముగియనుంది. 39 ఏళ్ల రోహిత్ శర్మ రిటైర్మెంట్పై కొంతకాలంగా వరుసగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్ నాటికి అతడి వయను 40కి చేరనుండటంతో భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో లార్డ్స్ వన్డేనే రోహిత్క చివరి మ్యాచ్ కావచ్చనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ మ్యాచ్లో రోహిత్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. భారత్ ఓడినప్పటికీ తన బ్యాట్తోనే విమర్శలకు సమాధానం ఇచ్చాడు. రోహిత్ కూడా తన కెరీర్పై వస్తున్న రూమర్పై గతంలో స్పందించాడు. బయట ఎలాంటి చర్చ జరిగినా తన దృష్టి మాత్రం మైదానంలో జట్టు విజయానికి సహకరించడంపైనే ఉంటుందని స్పష్టం చేశాడు. ప్రస్తుతం బీసీసీఐ కూడా రోహిత్ అనుభవం, ప్రదర్శనలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సైకియా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అయితే 2027 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని భవిషత్ ఓపెనర్లసు సిద్ధం చేసే ప్రక్రియ మాత్రం కొనసాగనుంది. యశస్వి జైస్వాల్ సహా ఇతర ఆటగాళ్లను సెలెక్టర్లు వరిశీలించే అవకాశం ఉంది.