బలహీనవర్గాల ప్రజలను సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశం
కార్యాచరణ సిద్ధం చేయాలన్న సీఎం చంద్రబాబు
-ఆదరణ - 3 ద్వారా కులవృత్తులకు ఆధునిక పరికరాల పంపిణీకి చర్యలు
రూ.60 కోట్ల సాస్కీ నిధులతో బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం
బీసీ హాస్టళ్లలో మార్చిలోగా ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం
ఆరు జ్యోతిరావు పూలే స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్
అమరావతి: వెనుకబడిన వర్గాలను (బీసీ) కేవలం సంక్షేమ లబ్దిదారులుగా పరిమితం చేయకుండా, వారిని సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా (మైక్రో ఎంట్రప్రెన్యూర్లు), ఎంఎస్ఎంఈలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు "స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష -నిర్వహించారు. కులవృత్తుల వారికి ఆధునిక పథకం ద్వారా సాంకేతికతను అందించే లక్ష్యంతో 'ఆదరణ-3' పథకం ద్వారా ఆధునిక పనిముట్లను పంపిణీ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. విద్యా రంగంలో బీసీ విద్యార్థులకు అత్యుత్తమ మౌలిక వసతులు కల్పించడంపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో రూ.60 కోట్ల సాస్కీ నిధులతో కొత్తగా బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఉన్న 814 బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు రూ.17 కోట్ల వ్యయంతో మార్చిలోగా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. హాస్టళ్లలో పారిశుధ్యం, విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని, అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాబోధన వంటి అన్ని అంశాల్లోనూ ఉత్తమ పద్దతులను (బెస్ట్ ప్రాక్టీసెస్) అనుసరించాలని సూచిం చారు. విద్యార్థుల విద్యాపరమైన పురోగతిని పర్యవేక్షిం చేందుకు వీలుగా అపార్ (v) ఐడీలను నమోదు చేసి, అనుసంధానం చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యా ప్తంగా నిర్మాణ దశలో ఉన్న బీసీ భవనాల పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. మహాత్మా జ్యోతిరా వు పూలే పేరుతో నడుస్తున్న 6 రెసిడెన్షియల్ పాఠశాల లను జూనియర్ కళాశాలల స్థాయికి అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక బీసీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేసే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు. బీసీ స్టడీ సర్కిళ్లను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, వారికి ప్రయోజనం చేకూరేలా వథకాలు రూపొందించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఆర్థిక నష్టాల నుంచి బయటపడుతున్న విశాఖ స్టీల్
ప్లాంట్ను మరింత బలోపేతం చేసేందుకు సహకారం
ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం చంద్రబాబు
ఆర్ధికంగా నష్టాల నుంచి లాభాల వైపు విశాఖ స్టీల్ ఉత్పత్తి సాధిస్తున్నదని సిఎం చంద్రబాబు అన్నారు. అన్ని విభాగాల్లో కొత్త విధానాలు ప్రవేశ పెట్టి ప్లాంట్ ను మరింత బలోపేతం చేయాలని సీఎం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశాఖ ఉక్కుకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సీఎండీ మనీష్ రాజ్ గుప్తా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఉత్పత్తిని పెంచేందుకు సహకరించిన యాజమాన్యం, కార్మికులు, ప్రభుత్వ అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు. 2024-25 సెకండ్ క్వార్టర్ లో కేవలం రోజుకు 9,215 టన్నుల మాత్రమే ఉత్పత్తి చేసిన విశాఖ ఉక్కు మూడు బ్లాస్ట్ ఫర్నేస్ లు పనిచేస్తుండడంతో హాట్ మెటల్ ప్రొడక్షన్ లో రోజుకు 19,401 టన్నుల ఉక్కు ఉత్పత్తి కి చేరుకుంది.