సౌత్ జోన్పై ఘన విజయం
మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో టైటిల్ కైవసం
13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీని గెలుచుకున్న ఈస్ట్ జోన్
కెప్టెన్ ఇషాన్ కిషన్ (270) భారీ డబుల్ సెంచరీ మహ్మద్ ఖురేషీకి తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీ
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ విజేతగా నిలిచింది. సౌత్ జోన్పై మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, 2012-13 సీజన్ తర్వాత మళ్లీ ప్రతిష్టాత్మకమైన ఈ ట్రోఫీని ముద్దాడింది. ఇది ఈస్ట్ జోను మూడో దులీప్ ట్రోఫీ టైటిల్ కావడం విశేషం. ఆఖరి రోజు ఆట ప్రారంభమైన తర్వాత ఈస్ట్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్్సు కొనసాగించింది. మహ్మద్ కౌనైన్ ఖురేషీ (116 నాటౌట్) తన కెరీర్లో తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీతో అదరగొట్టగా, అనుకుల్ రాయ్ (64) అర్ధశతకంతో రాణించాడు. 99.2 ఓవర్లలో 7 వికెట్లకు 388 పరుగులు చేసిన తర్వాత ఇన్నింగ్స్ ్ను డిక్లేర్ చేశారు. డిక్లరేషన్ ప్రకటించిన వెంటనే, ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్ జోస్ ఆటగాళ్లు విజయోత్సవాల్లో మునిగిపోయారు. వాస్తవానికి ఈ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లోనే ఈస్ట్ జోన్ తన పట్టు బిగించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (270) అద్భుతమైన డబుల్ సెంచర్, కుమార్ కుశాగ్ర (101) శతకం తోడపడంతో తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 708 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీనికి సమాధానంగా సౌత్ జోన్ 336 పరుగులకే ఆలౌ ట్ కావడంతో మ్యాచ్ ఫలితం దాదాపుగా ఖరారైంది. ఇషాన్ కిషన్ రెండో ఇన్నింగ్స్ లోనూ 80 పరుగులు చేసి, మ్యాచ్ మొత్తంలో 350 వరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈస్ట్ జోన్ విజయంలో ఝార్ఖండ్కు చెందిన యువ ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. కుశాగ్రతో పాటు తన అరంగేట్ర దులీప్ ట్రోఫీ మ్యాచ్లోనే శిఖర్ మోహన్ 85 పరుగులతో ఆకట్టుకున్నాడు. గత దేశవాళీ సీజన్లో ప్రదర్శించిన ఫామ్ను అతను కొససాగించారు. ఈ ముగ్గురి ప్రదర్శనతో ఈస్ట్ జోన్ టైటిల్ విజయంలో ఝార్ఖండ్ ఆటగాళ్ల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆఖరి రోజు ఉదయం ఖురేషీ, అనుకుల్ రాయ్ ఏదో వికెట్కు 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే స్లో ఓవర్ రేట్ కారణంగా 73వ ఓవర్లో సౌత్ జోన్కు అంపైర్లు 5 పరుగుల పెనాల్టీ విధించారు. 96వ ఓవర్లో పేనర్ సీవీ మిలింద్ బౌ లింగ్లో రెండు పరుగులు తీసి ఖురేషీ తన తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చెపాక్ లోని తీవ్రమైన తేమ, ప్రతికూల వాతాపరణాన్ని సైతం లెక్కచేయకుండా సౌత్ జోన్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన పోరాట వటిమను ప్రదర్శించాడు. మ్యాచ్ ఫలితం తేలిపోయినప్పటికీ, ఏకధాటిగా తొమ్మిది ఓవర్లు బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఇషాన్ కిషన్ డిక్లరేషన్ ప్రకటించిన వెంటనే, అంపైర్లు బెయిల్స్ను తొలగించి మ్యాచ్ను ముగించారు. దీంతో ఈస్ట్ జోన్ ఆటగాళ్లు మైదానంలోనే సంబరాలు చేసుకున్నారు. ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ ఒక స్టంప్ను చేతిలో పట్టుకుని డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులకు అభివాదం చేశారు.
సంక్షిప్త స్కోర్లు:
ఈస్ట్ జోన్: 708 388/7 డిక్లేర్డ్
(మహమ్మద్ ఖురేషి 116 నాటౌ ట్, ఇషాన్ కిషన్ 80; ఎండీ నిధీష్ 2-28)
సౌత్ జోన్: 336 (తిలక్ వర్మ 99; ముఖేశ్ కుమార్ 3-62